నవతెలంగాణ న్యూఢిల్లీ: రాజస్థాన్(Rajasthan)కాంగ్రెస్(Congress) నాయకుడు సచిన్ పైలట్(Sachin pilot), సారా అబ్దుల్లా(Sara)లు రహస్యంగా విడాకులు (divorce) తీసుకున్న విషయం ప్రస్థుత అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా దాఖలు చేసిన అఫిడవిట్లో వెలుగుచూసింది. 19ఏండ్ల క్రితం ప్రేమించుకొని పెండ్లి చేసుకున్న ఈ జంట విడాకులు తీసుకున్నారనే విషయం 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల కోసం దాఖలు చేసిన అఫిడవిట్లో వెల్లడైంది. 2023 రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో టోంక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు తన నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి సచిన్ పైలట్ విడాకులు తీసుకున్నట్టు అందులో పేర్కొన్నారు.
చిన్న వయసులోనే ఎంపీగా ఎన్నిక ఆ తర్వాత సచిన్ అసలు రాజకీయ ప్రయాణం మొదలైంది. సచిన్ పైలట్ కేవలం 26 ఏండ్లకే ఎంపీ అయ్యారు. తన తండ్రి రాజేష్ పైలట్ రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ సచిన్ దౌసా పార్లమెంటు నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎన్నికయ్యారు. ఆ తరువాతే సచిన్, సారాల వివాహాన్ని ఫరూఖ్ అబ్దుల్లా కుటుంబం అంగీకరించింది. 2018 అఫిడవిట్లో సచిన్ తన ఆస్తులను రూ. 3.8 కోట్లుగా ప్రకటించగా, ఈ ఏడాది అంటే 2023 నాటికి అది దాదాపు రూ.7.5 కోట్లకు పెరిగింది. వీరికి ఇద్దరు కుమారులు. వారి పేర్లు అరన్ పైలట్, విహాన్ పైలట్. ఎన్నికల అఫిడవిట్లో తన కుమారులను డిపెండెంట్లుగా సచిన్ పైలట్ పేర్కొన్నారు.