నవతెలంగాణ – హైదరాబాద్: ఐటీఎఫ్ ఫ్యూచర్స్ టెన్నిస్ టోర్నమెంట్లో హైదరాబాదీ గంటా సాయికార్తీక్ రెడ్డి జోడీ ఫైనల్స్ చేరి టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. ఇండోనేసియాలోని జకార్తలో జరుగుతున్న ఈ పోటీల సెమీఫైనల్స్లో సాయికార్తీక్–సిద్ధాంత్ (పుణె) జోడీ 6–3, 7–5తో కజుమో–కవహాషి (జపాన్) ద్వయంపై నెగ్గి, ఫైనల్ బెర్త్ సాధించింది.