నవతెలంగాణ- కంటేశ్వర్
రెండవసారి 226 వాహనాలకు ఈనెల 20న బహిరంగ వేలం వేయబడునని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ బుధవారం తెలియజేశారు. మొదటి వేలం పాట క్యాన్సల్ చేయడం జరిగిందన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధించి వీధులలో (Street) ఆచూకీ లేకుండా వదిలివేసి | వెళ్ళిన (Unclaimed/Abandoned vehicles) వివిధ రకములైన మోటార్ సైకిల్లు, ఆటోలు మొత్తం (226) వాహనాలను పోలీసు లైన్, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నందు జమ చేయడమైనది.ఇట్టి వాహనములను U/s 7 of Nizamabad (Metropolitan area) Police Act-2016 ప్రకారము నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో బహిరంగ వేలం కొరకు తేదీ:-09-02-2023 రోజున పత్రికా ప్రకటన (2nd Phase Proclamation order) ఇవ్వడం జరిగింది వాహనములకు సంబంధించిన పూర్తి వివరాలను అదేరోజు వెబ్ సైటులలొ https://twitter.com/cp-nizamabad https://www.facebook.com/cp.nizamabad (Citizen Services-abandoned / unclaimed vehicle list-2021) లో పొందుపరచడమైనది. ప్రకటన వెలువడిన నుండి (06) నెలల కాల వ్యవధి గడువు ముగిసినందున , నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని (226) వివిధ రకాల వాహనాలను, బహిరంగ వేలానికి సంబంధించిన కమిటీ ఆధ్వర్యంలో తేదీ: 20-09-2023 రోజున ఉదయం సమయం 11.00 గంటలకు పోలీసు లైస్, ఎల్లమ్మ గుట్ట, నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ నందు హాజరు కాగలరు. కావున ఇట్టి బహిరంగ వేలంలో పాల్గొనాలనుకునేవారు, వారికి సంబంధించిన ఆధార్ కార్డు, ఏదైనా గుర్తింపు కార్డులు (కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఆమోదం పొందినది) మరియు ఇతర వివరాలు గల పత్రాలు వారి వెంట తీసుకొని రాగలరు. వివరాల కొరకు మోటోర్ వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీపాల్, నిజామాబాద్ గారిని సంప్రదించగలరు. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ : 8712659702 అని తెలిపారు.