కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బొల్లు దేవేందర్
నవతెలంగాణ -తాడ్వాయి :
ములుగు నియోజకవర్గంలో సీతక్క గెలుపు ఖాయమని, గెలుపును ఎవరు వచ్చిన ఆపలేరని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు బొల్లు దేవేందర్ అన్నారు. గురువారం మండల కేంద్రంలో పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ప్రజలకు కష్టం వచ్చినప్పుడు రాని మంత్రులు బిఆర్ఎస్ నేతలు ఎన్నికల సమయాన మిడుతల దండుల వచ్చి సీతక్క టార్గెట్ అని అనడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. భయంతో మంత్రులందరూ సీతక్క టార్గెట్ అని అంటున్నారని, ఒక గిరిజన మహిళను ఓడించడానికి మీరందరూ తిరుగుతున్నారంటే సీతక్క నైతికంగా గెలిచినట్టే అని అన్నారు. పంచాయతీ అభివృద్ధి కోసం కాంటాక్ట్ చేసిన కాంట్రాక్టర్లకు సరైన సమయానికి డబ్బులు చెల్లించని స్థితిలో ఉంటే గ్రామపంచాయతీకి డబ్బులు ఇవ్వకుండా గ్రామాల అభివృద్ధికి నిలిపివేసిన అతను ములుగు జిల్లాకు ఎర్రబెల్లి దయాకర్ రావు మంత్రిగా చేసిన అభివృద్ధి ఏమిటని ప్రశ్నించారు. ఇంటర్ కాలేజీ ఇస్తానని ఇవ్వకుండా మోసం చేశారని అలాగే వంద పడకల ఆసుపత్రి చేస్తానని నమ్మించి మీ నియోజకవర్గ ప్రజలు మోసం చేసిన నువ్వు ప్రశ్నిస్తే అక్రమ కేసులు వేయించిన నువ్వు జిల్లాకు ఏదో చేస్తానంటే ప్రజలు ఎవరు నమ్మరని అన్నారు. ఈ కార్యక్రమంలో సహకార సంఘం చైర్మన్ పులి సంపత్ గౌడ్, జిల్లా సీనియర్ నాయకులు ఆర్ఎం లచ్చు పటేల్ , పిఎసిఎస్ మాజీ చైర్మన్ పాక సాంబయ్య, డైరెక్టర్లు సిద్ది రెడ్డి జానకి రాంబాబు ఎస్సీ సెల్ జిల్లా సీనియర్ నాయకులు నరసయ్య గ్రామ కమిటీ అధ్యక్షులు రాజేందర్ సీనియర్ నాయకులు భూపతి జనార్ధన్ గోపాల్ తదితరులు పాల్గొన్నారు.