నవ తెలంగాణ-రామగిరి: రామగిరి మండలంలోని రాజాపూర్ గ్రామ పరిధిలో శుక్రవారం టీవీఎస్ పల్సర్ బైక్ ఢీకొన్నాయి ఈ ఘటనలో ముగ్గురు పురుషులకు తీవ్ర గాయాలు కాగా మహిళకు చేతికి ఫ్రాక్చర్ అయింది. అటువైపుగా ప్రచారానికి వస్తున్న మంథని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రు పట్ల సునీల్ రెడ్డి వారిని గమనించి వెంటనే తన వాహనంలో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఆయన వెంట నాయకులు మొలుమూరు శ్రీనివాస్, తొట్ల రాజు, నాగరాజు, కేకల రాకేష్ ఉన్నారు.