రెంజల్ మండలంల కేంద్రంలోని గ్రామపంచాయతీ సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేయడం జరిగిందని సర్పంచ్ ఎమ్మెస్ రమేష్ కుమార్ తెలిపారు. శనివారం సర్పంచ్ రమేష్ కుమార్ అధ్యక్షతన పాలకవర్గ సభ్యులతో సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తగా గ్రామంలోని ప్రభుత్వ కార్యాలయాలు, గ్రామంలోని ప్రధాన వీధుల గుండా, స్ప్రే మందులను పిచికారి చేయించాలని, స్వచ్ఛతాహి సేవా కార్యక్రమంలో భాగంగా మురికి కాలువలను శుభ్రం చేయడం, పైప్లైన్ల లీకేజీలను మరమ్మత్తులు జరిపించడం, గ్రామంలోని చెత్తాచెదారాన్ని డంపింగ్ యార్డ్ కు తరలించడం తదితర పనులపై తీర్మానాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ అన్నం గంగమని, పాలకవర్గ సభ్యులు అగ్గు వెంకటి, గంగారెడ్డి, రంజిత్ కుమార్, సిరాజుద్దీన్, మంగళ్ పాడ్ లక్ష్మణ్, ఇర్ఫానా, లక్ష్మీ గారి రేఖ, కనకవ్వ, గ్రామ కార్యదర్శి రాజేందర్ రావు, సిబ్బంది శంకర్, ప్రవీణ్ కుమార్, నిస్సార్ తదితరులు పాల్గొన్నారు.