– విద్యార్ధి నాయకులపై పోలీసులు విక్షచణ రహితంగా దాడి..
– గత మూడేళ్ళుగా పెండింగ్ ఉన్న స్కాలర్ షిప్స్ & రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలి.
– నూతన విద్యావిధానం 2020 తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా అసెంబ్లీలో తీర్మానం చేయాలి.
– గురుకులాలు, సంక్షేమ వసతిగృహాలకు సోంత భవనాలు నిర్మించాలి, తక్షణమే గురుకుల విద్యార్ధుల సమస్యలు పరిష్కారం చేయాలి.
– ఇంటర్ విద్యార్ధులకు మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి. పాఠ్యపుస్తకాలు తక్షణమే ఇవ్వాలి.
– ప్రయివేట్ యూనివర్శీటీలకు రాష్ట్రంలో అనుమతులు ఇవ్వవద్దు.
– అర్ధరాత్రి నుండే రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ నాయకత్వాని ముందస్తుగా అక్రమ అరెస్టులు. అసెంబ్లీ దగ్గర పోలీసులు దాడిని,ముందస్తు అరెస్టులను ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు ఎస్ఎఫ్ఐ పిలుపు.
నవతెలంగాణ- హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళుగా పెండింగ్ లో ఉన్న స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ, తదితర సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరుతూ ఆదివారం ఛలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ విద్యార్ధి నాయకులను పోలీసులు విక్షచణ రహితంగా దాడి చేసిప్రయి, అక్రమంగా అరెస్ట్ చేసి గోషామహాల్, చిక్కడపల్లి, నాంపల్లి, ముషిరాబాద్ పోలీసు స్టేషన్స్ కు తరలించారు.
– ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు ఆర్ఎల్. మూర్తి, టి.నాగరాజు లు మాట్లడుతూ తెలంగాణ రాష్ట్రంలో గత మూడేళ్ళుగా 5,177 కోట్లు రూపాయలు స్కాలర్ షిప్స్ మరియు ఫీజు రీయంబర్స్ మెంట్స్ ప్రభుత్వం విడుదల చేయకుండా విద్యార్థులు ఉన్నత విద్యకు వెళ్ళకుండా నిర్లక్ష్యం చేస్తుంది. బడ్జెట్లో 0.1 శాతం కూడా కాదు ఈ నిధులు విడుదల కోసం మూడేళ్ళ నుండి నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో ముఖ్య మంత్రికి కానీ, ఒక్కమంత్రికి గాని, ఎమ్మెల్యే కానీ ఒక్కనెల కూడా వాళ్ళు జీతాలు పెండింగ్ లేవు మరి విద్యార్థులకు ఎందుకు అని ప్రశ్నించారు. తక్షణమే పెండింగ్ ఫీజు బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
– విద్యాసంవత్సరం ప్రారంభం అయ్యి రెండు నెలలు గడుస్తున్నా ఇప్పటికి యూనిఫామ్ ఇవ్వలేదు, ఇంటర్ విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు లేవు, లెక్చరర్స్, టీచర్స్ ఖాళీలు భర్తీ లేదు, పంద్రాగస్టు కూడొ పాత బట్టలతోనే విద్యార్థులు విద్యాసంస్థలకు వెళ్ళాలా అని ప్రశ్నించారు.
– ప్రభుత్వం గోప్పగా చెప్పుకుంటున్నా గురుకులాలు మరింత ఆధ్వానంగా ఉన్నాయి.1008 గురుకులాలు అద్దె భవనాల్లో నడుస్తున్నాయి.కనీసం సౌకర్యాలు లేవు, సన్నబియ్యం పెడుతున్నామని చెబుతున్న ఆచరణలో అమలు లేదు, మెనూ అమలు లేదు, మెస్ బిల్లులు రాక నాణ్యమైన భోజనం పెట్టక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాస్మోటిక్ ఛార్జీలు నెలకు హస్టల్స్ విద్యార్ధులకు 62/- బాలురు ,150/- బాలికలు ఇస్తున్న గత 8 నెలలుగా పెండింగులో ఉన్నాయి. ఎలా విద్యార్ధులు చదువుకోవాలని ఎస్ఎఫ్ఐ అడుగుతుందన్నారు. 2018లో ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజన పథకం ప్రారంభించిన ప్రభుత్వం ఇప్పటికీ అమలుకు నోచ్చుకోవడం లేదు. గోప్పగా అసెంబ్లీలో ప్రకటించిన పథకం అమలు జరగడం లేదు.తక్షణమే ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్నం భోజనం అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాము.రాష్ట్రంలో ప్రైవేట్ యూనివర్శీటీలకు అనుమతి ఇవ్వకుండా ప్రభుత్వ యూనివర్శీటీలను అభివృద్ధి చేయాలని ఎస్ఎఫ్ఐ కోరుతుంది. ఈ డిమాండ్స్ పరిష్కారం చేయాలని ఆందోళన చేస్తున్న ఎస్ఎఫ్ఐ నాయకులపై పోలీసులు అత్యుహ్సం తో దాడి చేశారు. ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి మిశ్రీన్,కె.ప్రశాంత్, రాష్ట్ర కమిటీ సభ్యులు రమ్య,రాష్ట్ర కార్యదర్శి టి.నాగరాజు,అధ్యక్షుడు మూర్తి, రాష్ట్ర కమిటీ సభ్యులు యార ప్రశాంత్ లపై భౌతిక దాడి చేశారు. విద్యార్ధులని చూడకుండా చోక్కాలు చించి పోలీసు వ్యాన్ లలో బలవంతంగా లాక్కెల్లి ఎత్తిపడేశారు. గత అర్ధరాత్రి నుంచే రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాలో ఎస్ఎఫ్ఐ నాయకత్వాని అక్రమంగా అరెస్ట్ చేశారు. కార్యకర్తలు ఇండ్లకు వెళ్ళి అరెస్టులు చేశారు. ఈ అక్రమ అరెస్టులను, అసెంబ్లీ దగ్గర పోలీసు దాడులను ఖండిస్తూ రేపు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ ఆందోళనలకు పిలుపునిస్తుంది. ఈ ఛలో అసెంబ్లీ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యాక్షులు కె.ప్రశాంత్, మమత, సంతోష్ రాథోడ్,బి.శంకర్, రాష్ట్ర సహాయకార్యదర్శులు దమెర కిరణ్ ,మిశ్రీన్ సుల్తాన, అశోక్ రెడ్డి, దాసరి ప్రశాంత్ రాష్ట్ర కమిటీ సభ్యులు అరవింద్, యార ప్రశాంత్, డి.సందీప్, రమ్య, భరత్, లెనిన్,జె. రమేష్, తదితరులు పాల్గొన్నారు.