నవతెలంగాణ-హైదరాబాద్ : ఇజ్రాయెల్ దళాలకు హమాస్ మిలిటెంట్లకు భీకర పోరు కొనసాగుతోంది. ఇరువైపులా వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు ఈజిప్టులోని ఇజ్రాయెల్ టూరిస్టులపై కాల్పులు జరిగాయి. మధ్యధరా సమీపంలోని అలెగ్జాండ్రియా నగరంలో ఆదివారం చోటు చేసుకొన్న ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అలెగ్జాండ్రియా నగరంలో ఉన్న ఓ పర్యాటక కేంద్రంలో స్థానిక పోలీసు ఒకరు టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇజ్రాయెల్కు చెందిన ఇద్దరు పౌరులు, ఈజిప్టు వ్యక్తి ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఈజిప్టు మీడియాకు వెల్లడించింది. అంతేకాకుండా, పాంపీస్ పిల్లర్ సైట్ వద్ద జరిగిన మరొక దాడిలో ఓ వ్యక్తి గాయపడిన్నట్లు తెలుస్తోంది. దాడి జరిగిన ప్రాంతాన్ని వెంటనే భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఈ ఘటనలో ఓ అనుమానితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.