– 11,266 మేజర్, కెప్టెన్ ర్యాంకు అధికారుల ఖాళీలు : లోక్సభలో
– కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ
న్యూఢిల్లీ : భారత్లో త్రివిధ దళాలైన ఆర్మీ, వైమానిక దళం, నేవీలో రక్షణాధికారుల కొరత ఏర్పడింది. కోవిడ్ మహమ్మారి సమయంలో అధికారులను తక్కువగా తీసుకోవడం కారణంగా 11,266 మంది మేజర్లు, కెప్టెన్లు కొరత ఈ రెండు విభాగాల్లో ఏర్పడింది. లోక్సభలో కేంద్రం వెల్లడించిన సమాచారంలో ఈ విషయం వెల్లడైంది.సైన్యంలో 2,094 మంది ప్రధాన స్థాయి అధికారుల కొరత ఉండగా.. కెప్టెన్ స్థాయిలో 4,734గా ఉన్నది. భారత వైమానిక దళంలో 881 స్క్వాడ్రన్ లీడర్లు, 940 ఫ్లైట్ లెఫ్టినెంట్ల కొరత ఉన్నది. నేవీలో 2,617 మంది లెఫ్టినెంట్ కమాండర్ మరియు అంతకంటే తక్కువ స్థాయి అధికారుల కొరత ఉన్నది. భారత్లో కోవిడ్ -19 మహమ్మారి విజృంభించిన సమయంలో అధికారుల నియా మకాలు తక్కువగా జరపటం కొరతకు ప్రధాన కారణమని కేంద్రం పేర్కొ న్నది. ఇక ఎన్డీయేలో మహిళా క్యాడెట్ల సంఖ్యలో హర్యానా ముందంజలో ఉంది. ఇక ఎన్డీయే, పూణేలో గతేడాది కాలంలో మొత్తం 57 మహిళా క్యాడెట్ ల ఖాళీలు పూర్తిగా సభ్యత్వం పొందాయి. అత్యధిక క్యాడెట్లు (19) హర్యానా నుంచి, 12 మంది యూపీ నుంచి ఉన్నారు. పంజాబ్, ఢిల్లీ, జమ్మూకాశ్మీర్ల నుంచి ఒక్కొక్కరు ముగ్గురు క్యాడెట్లు, హిమాచల్ప్రదేశ్ నుంచి ఇద్దరు ఉన్నారని కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు తెలిపింది.