నవతెలంగాణ-సిద్దిపేట : మారుమూల ప్రాంతంలో ప్రతిభ కలిగిన క్రీడాకారులను వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర స్థాయిలో ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడమీ హైదరాబాద్ వారు అండర్ 14 క్రీడాకారుల కోసం సెలక్షన్స్ “ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ” ఆదివారము నిర్వహించారు. ఈ సెలెక్షన్స్ లో సిద్దిపేట జిల్లా క్రికెట్ అసోసియేషన్ క్రీడాకారుల నుంచి ముగ్గురు క్రీడాకారులు వికెట్ కీపర్ మరియు బ్యాట్స్మెన్ సాయి హర్షిత్, బౌలింగ్ విభాగంలో అఖిల్ రఘువీర్ , బౌలింగ్ మరియు బ్యాటింగ్ లో లక్ష్మీ సహస్ర ఎంపికైనట్లు సిద్దిపేట క్రికెట్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మల్లికార్జున్ తెలిపారు. సిద్దిపేట లో అంతర్జాతీయ స్ధాయిలో క్రికెట్ గ్రౌండ్ ఏర్పాటు చేసి, మౌలిక సౌకర్యాలను అందించిన మంత్రి హరీశ్ రావు చోరువతో క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ఎంపిక అవుతున్నారని అన్నారు. ఎంపికైన క్రీడాకారులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కోచ్ లు బజ్జి, మధు, బాబు ,అమీర్ జాని, మాజిత్ లు పాల్గొన్నారు.