హైదరాబాద్ : పుప్పాల గూడలో దారుణం చోటు చేసుకుంది. పెండ్లి కావడం లేదని శ్రేయా రెడ్డి అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్ ఆత్మహత్యకు పాల్పడింది. సోడియం నైట్రేట్ స్వీకరించి శ్రేయ రెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. విదేశాల్లోనూ శ్రేయారెడ్డి ఉద్యోగం చేసింది. గత కొన్ని నెలలుగా పెండ్లి కావడం లేదని ఆమె డిప్రెషన్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే పుప్పలగూడలో నివాసం ఉంటున్న ఇంట్లోనే శ్రేయా రెడ్డి ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు.