– ఇప్పటి వరకు 49,50,20,372 నగదు సీజ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఎన్నికల ప్రక్రయ మొదలైనప్పటి నుంచి అటు పోలీసులు, ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఒక్కరోజే హైదరాబాద్ నగరంలో రూ.1,15,000 సీజ్ చేశారు. ఇప్పటి వరకు ఫ్లయింగ్ స్క్వాడ్లు 3,58,47,450 నగదును సీజ్ చేయగా, పోలీసుల ద్వారా రూ.3,67,183 సీజ్ చేశారు. మొత్తం కలిసి ఇప్పటివరకు 49,50,20,372 నగదును సీజ్ చేశారు. బుధవారం ఒక్కరోజే 16 ఎఫ్.ఐ.ఆర్లు నమోదు కాగా, ఇప్పటి వరకు 727 కేసులు నమోదు చేశారు. 3064 బైండోవర్ చేశారు.
2262 నాన్ బెయిలబుల్ వారెంట్లు నమోదు చేశారు. 6,020 వాల్ రైటింగ్లు, 86,929 పోస్టర్లు, 30112 బ్యానర్ తొలిగించారు. 53 అనుమతి లేకుండా సమావేశాలు నిర్వహించడంతో కేసులు నమోదు చేశారు. మద్యం 184 లీటర్స్ సీజ్ చేశారు.