నవతెలంగాణ-ఆర్మూర్ : జాతీయ బీసీ సంక్షేమ సంఘం మండల అధ్యక్షునిగా మండలం లోని ఇసాపల్లి గ్రామానికి చెందిన వేంపల్లి శ్రీనివాస్ గౌడ్ ను నియమించినట్లు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు కొండవీటి శ్యాంప్రసాద్ తెలిపారు. పట్టణంలోని భరత్ చంద్ర స్కూల్లో జరిగిన కార్యక్రమంలో ఈమేరకు శ్రీనివాస్ గౌడ్ కు నియామక పత్రం సోమవారం అందజేశారు. ఎన్నికైన శ్రీనివాస్ గౌడ్ మండల పరిధిలో విస్తృతంగా పర్యటించి మండలంలో బీసీలకు రాజ్యాధికార ఫలాలు అందేలా కృషి చేయాలని కొండవీటి శ్యాం ప్రసాద్ సూచించారు. బీసీలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడేందుకు ముందు వరసలో నిలవాలని కోరారు. ఈ కార్యక్రమంలో బిసి జిల్లా కోశాధికారి రాంగిరి నర్సయ్య, బిసి మహిళా రాష్ట్ర కార్యదర్శి అరుణ జ్యోతి, విశ్రాంత ఉద్యోగ సంక్షేమ సంఘం కన్వీనర్ మంచిర్యాల ప్రభాకర్ చారి, కార్మిక సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్ జోగన్పల్లి సంతోష్ గౌడ్, బీసీ మహిళ అధ్యక్షురాలు వీణ గౌడ్, ఆర్మూర్ డివిజన్ కమిటీ అధ్యక్షులు ఎస్ రుక్మాజి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు పుష్పలత, అధికార ప్రతినిధి సరిత, జిల్లా నాయకురాలు స్వాతి తదితరులు పాల్గొన్నారు.