నవతెలంగాణ -డిచ్ పల్లి
తెలంగాణ యూనివర్సిటీ ఉర్దూ శాఖ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖవి కి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉర్దూ అకాడమీ, తెలంగాణ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సంయుక్త నిర్వహణలో ఉర్దూ శాఖలో ఉత్తమ అధ్యాపక అవార్డు రావడం తెలంగాణ యూనివర్సిటీ కీ గర్వకారణమని తెలంగాణ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం యాదగిరి అన్నారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ ఎం యాదగిరి మహమ్మద్ అబ్దుల్ ఖవి ని శాలువా మెమొంటోతో పాటు ప్రశంసా పత్రం ఇచ్చి ఘనంగా సత్కరించారు.డాక్టర్ మహమ్మద్ అబ్దుల్ ఖవి 2014 నుంచి తెలంగాణ యూనివర్సిటీ అధ్యాపకులుగా సేవలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఉర్దూ శాఖ పాఠ్య ప్రణాళికా సంఘం అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.గతంలో తెలంగాణ యూనివర్సిటీ వార్డెన్ గా, చీప్ వార్డెన్ గా, పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా,అడిషనల్ కంట్రోలర్ గా, స్పోర్ట్స్ డైరెక్టర్గా, అనేక బాధ్యతలు నిర్వహించి ఉత్తమ ఉద్యోగ అవార్డు స్వీకరించారు.అత్యంత ప్రతిభావంతమైన అబ్దుల్ ఖవి రాసిన పుస్తకాలు అంబేద్కర్ యూనివర్సిటీ, మాను యూనివర్సిటీ రిఫరెన్స్ గ్రంథాలుగా గుర్తించ బడిందని వివరించారు.లండన్ లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో తెలంగాణ రాష్ట్ర ఉర్దూ మౌలిక పరిశోధకుడిగా భాషా సాహిత్యం పై పత్ర సమర్పణ చేసి ఉత్తమ పరిశోధకుడుగా అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. అనేక అంతర్జాతీయ సదస్సులో ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొన్నారు. తెలంగాణ యూనివర్సిటీ నుండి ఉర్దూ శాఖలో అత్యుత్తమమైన రచనలు చేస్తూ ఉద్యోగిగా మౌలికమైన బాధ్యత నిర్వహిస్తూ పలువురు మన్ననలను పొందుతున్నారు.డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ ఖవికి ఈ అవార్డు రావడం పట్ల తెలంగాణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ వాకాటి కరుణ అభినందనలు తెలిపారు.ఈ అవార్డు రావడం పట్ల ఉర్దూ విభాగాధిపతి డాక్టర్ గుల్ -ఇ -రాణా, చైర్మన్ బిఓఎస్ డాక్టర్ మూసా ఖురేష్, డాక్టర్. ఆంజనేయులు, డాక్టర్ వాసం చంద్రశేఖర్, డాక్టర్ నాగరాజు పాత, డాక్టర్ నాగరాజు, డాక్టర్ మావురపు సత్యనారాయణ, డాక్టర్ రవీందర్ రెడ్డి డాక్టర్ త్రివేణి, డాక్టర్ రాంబాబు పి ఆర్ ఓ డాక్టర్ ఏ పున్నయ్య తదితర అధ్యాపక మిత్రులు ఈ సందర్భంగా మొహమ్మద్ అబ్దుల్ ఖవి ని అభినందించారు.