నవతెలంగాణ – ముంబాయి: దేశీయ స్టాక్ మార్కెట్ల(Stock Market) వరుస నష్టాలకు బ్రేక్ పడింది. ఈరోజు మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. కొన్ని సెషన్లుగా ప్రాఫిట్ బుకింగ్(booking) చేసిన ఇన్వెస్టర్లు… ఈరోజు అమ్మకాలకు(sales) మొగ్గు చూపారు. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 406 పాయింట్లు లాభపడి 65,632కి ఎగబాకింది. నిఫ్టీ 110 పాయింట్లు పెరిగి 19,546 వద్ద స్థిరపడింది.