నవతెలంగాణ-హైదరాబాద్ : దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు గురువారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ఉదయం స్వల్ప లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. అక్కడి నుంచి రోజంతా తీవ్ర ఒడుదొడుకుల్లో చలించాయి. రెండు రోజుల వరుస ర్యాలీ నేపథ్యంలో కీలక స్టాక్స్లో మదుపర్లు లాభాలను స్వీకరించారు. మరోవైపు నిన్న వెలువడ్డ టీసీఎస్ ఫలితాలు మదుపర్లను నిరాశపర్చాయి. దీంతో మొత్తం ఐటీ షేర్లలో బలహీనతలు కొనసాగాయి. ఇది సూచీల సెంటిమెంటును దెబ్బతీసింది. మరోవైపు మరికొన్ని కీలక కంపెనీల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలోనూ మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరించారు.