నవతెలంగాణ – ముంబాయి: నిన్న నష్టాలను చవిచూసిన స్టాక్ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల్లోకి మళ్లాయి. బలహీనంగా ఉన్న ఆసియా మార్కెట్ల ప్రభావంతోపాటు, ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైన వెంటనే మన మార్కెట్లు కూడా భారీ నష్టాల్లోకి జారుకున్నాయి. అయితే, ట్రేడింగ్ చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో లాభాల్లోకి వెళ్లాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 159 పాయింట్లు లాభపడి 63,328కి చేరుకుంది. నిఫ్టీ 61 పాయింట్లు పుంజుకుని 18,817కి పెరిగింది. పవర్, ఆటో, ఐటీ, టెలికాం, టెక్ తదితర సూచీలు లాభాలను ఆర్జించగా.. ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆయిల్ అండ్ గ్యాస్ తదితర సూచీలు నష్టపోయాయి.