నవతెలంగాణ -హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈ ఉదయం ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష నిర్ణయాల నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 307 పాయింట్లు కోల్పోయి 65,688కి పడిపోయింది. నిఫ్టీ 89 పాయింట్లు నష్టపోయి 19,543 వద్ద స్థిరపడింది.