నవతెలంగాణ- హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే ఒడిదుడుకులకు గురయ్యాయి. ఆ తర్వాత కొనుగోళ్ల అండతో పుంజుకుని లాభాల్లో పయనించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 110 పాయింట్లు లాభపడి 64,996కి చేరుకుంది. నిఫ్టీ 40 పాయింట్లు పుంజుకుని 19,306 వద్ద స్థిరపడింది.