![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230916-WA00421-300x132.jpg)
నవ తెలంగాణ హుస్నాబాద్ రూరల్ : కళాశాల విద్యార్థినులు కష్టంతో కాకుండా ఇష్టంతో చదివి మంచి మార్కులు తెచ్చుకొని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న అన్నారు. శనివారం హుస్నాబాద్ ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ప్రెషర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమనికి హాజరైన చైర్మన్ మాట్లాడుతూ ఈ కళాశాలలో 18 మంది విద్యార్థులకు ఎంసెట్ లో ర్యాంకు రావడం చాలా గర్వకారణంగా ఉందని అన్నారు. అనంతరం కళాశాలలో విద్యార్థులు చేసిన నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో డి ఐ ఓ సూర్య ప్రకాష్, వైస్ చైర్మన్ ఐలేని అనిత, రాంచంద్రారెడ్డి, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ దేవ స్వామి, ప్రభుత్వ బాలికల బాలుర పాఠశాల ప్రధానోపాధ్యాయులు మనీలా, వెంకటయ్య, కళాశాల బృందం విద్యార్థినిలు తదితరులు పాల్గొన్నారు.