నగరంలోని మూడవ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒంటరి వాడిని అయ్యానని కారణంతో ఓ యువకుడు కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మూడవ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ప్రవీణ్ తెలిపారు. ఎస్సై ప్రవీణ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఆదర్శ నగర్ ప్రాంతానికి చెందిన రాపల్లి వెంకట్ (35) బుధవారం రాత్రి కత్తితో గొంతు కోసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం ఉదయం స్థానిక కాలనీవాసులు చూసి మూడవ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వెంకట్ మూడు సంవత్సరాల క్రితం వినాయక్ నగర్ కు చెందిన ఉషా అనే యువతిని వివాహం చేసుకున్నాడు. బార్య భర్తల మధ్య చిన్నపాటి గొడవ కారణంగా సంవత్సరం క్రితం భార్య తల్లిగారింటికి వెళ్ళింది. ఆరు నెలల క్రితం తల్లి మరణించగా, కన్నవాళ్ళు, కట్టుకున్న భార్య లేకపోవడంతో ఇంట్లో ఒంటరిగా జీవిస్తున్నాడు. బుధవారం రాత్రి కత్తితో గొంతు కోసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇది చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుడికి ముగ్గురు అక్క, చెల్లెలు ఉన్నారు.