![ఉద్యోగులకు ఇన్ఫోసిస్ తీపి కబురు](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/10/Infosys.jpg)
నవతెలంగాణ హైదరాబాద్: ఇన్ఫోసిస్ (Infosys) కంపెనీ తమ ఉద్యోగులకు తీపికబురు అందించింది. నవంబర్ 1 నుంచి ఉద్యోగులకు వేతన పెంచుతున్నట్టు ప్రకటించింది. కంపెనీ హెచ్ఆర్ చీఫ్ షజి మ్యాథ్యూ టౌన్హాల్ మీటింగ్ సందర్భంగా ఈ విషయం వెల్లడించారు. గత కొద్దినెలలుగా ఇన్ఫోసిస్ వార్షిక వేతన పెంపును వాయిదా వేస్తున్న క్రమంలో కంపెనీ ఈ ప్రకటన చేయడంతో ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.