నవతెలంగాణ – ఢిల్లీ: చంద్రబాబు అరెస్టు అక్రమమని పార్లమెంట్ ఉభయసభల్లో చర్చే ప్రధాన అజెండాగా నేడు ఢిల్లీలో నారా లోకేశ్ అధ్యక్షతన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశం జరగనుంది. ఈ మేరకు ఎంపీ గల్లా జయదేవ్ నివాసంలో మధ్యాహ్నం 3 గంటలకు టీడీపీ ఎంపీలు సమావేశం కానున్నారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహంపై ప్రధానంగా చర్చించనున్నారు. చంద్రబాబు అరెస్టు, ఏపీలో ప్రస్తుత పరిస్థితులు పార్లమెంటు దృష్టికి తీసుకెళ్లేలా వ్యూహ రచన చేయనున్నారు. వివిధ పార్టీల మద్దతుతో చంద్రబాబు అరెస్టు అంశం ఉభయసభల్లో చర్చకు తీసుకెళ్లేలా కసరత్తు చేయనున్నారు.