నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల కోడ్ నేపథ్యంలో అక్టోబర్ 9 తేదీ నుంచి ఇప్పటి వరకు 571 కోట్ల 80 లక్షలకు పైగా నగదు, ఆభరణాలు, మద్యం, ఇతరత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ వికాస్ రాజ్ వెల్లడించారు. గడచిన 24 గంటల్లో స్వాధీనం చేసుకున్న మొత్తం 12 కోట్ల 88 లక్షలకు పైగా ఉన్నట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు 198 కోట్ల 30 లక్షలకు పైగా నగదు… 178 కోట్ల 81 లక్షలకు పైగా విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. బియ్యం, కుక్కర్లు, చీరలు, సహా ఇతరత్రా కానుకలను స్వాధీనం చేసుకున్నట్లు సీఈఓ వివరించారు.