జక్రాన్ పల్లి మండలం పలు గ్రామాలలో జాతీయ సమైక్య దినోత్సవం పురస్కరించుకొని జాతీయ జెండాలను ఎగురవేశారు.సందర్భంగా జక్రం పెళ్లి మండల కేంద్రంలో ఎంపీపీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎంపీపీ కుంచాల విమల రాజు, తాసిల్దార్ కార్యాలయం లో తాసిల్దార్ కలీం, ఎంపీడీవో కార్యాలయంలో ఇన్చార్జ్ ఎంపీడీవో బ్రహ్మానందం , ఐకెపి కార్యాలయంలో మండల సమైక్య అధ్యక్షురాలు వనిత, వ్యవసాయ కార్యాలయంలో ఏవో దేవిక, అర్గుల్ సింగిల్ విండోలో చైర్మన్ ఆర్మూర్ గంగారెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. కార్యక్రమంలో ఎంపీపీ కుంచాల విమాల రాజు, వైస్ ఎంపీపీ తిరుపతి రెడ్డి ,ఎండిఓ, ఎమ్మార్వో ఎంపిటిసి గంగారెడ్డి ,కో ఆప్షన్ మెంబర్ బుల్లెట్ అక్బర్ ఖాన్, మండల అధికారులు, మహిళా సభ్యులు నాయకులు పాల్గొన్నారు.