చింతా గోపాలకష్ణా రెడ్డి సమర్పణలో శతమానం భవతి ఆర్ట్స్ బ్యానర్పై సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కథా కేళి’. ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్లో ‘కథా కేళి’ మూవీ లోగోను నిర్మాత దిల్ రాజు విడుదల చేశారు. టీజర్ను డైరెక్టర్ హరీశ్ శంకర్ రిలీజ్ చేేశారు.
ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ, ‘ఈ టీజర్ చూస్తుంటే సతీశ్ కొత్త ప్రయత్నం చేసినట్లు అనిపిం చింది. సినిమా విజయం సాధించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటు న్నాను’ అని అన్నారు. ‘ఈ సినిమా టీజర్ చూస్తుంటే సినిమా మంచి పేరు, లాభాలను తెచ్చి పెడుతుందని భావిస్తున్నాను’ అని డైరెక్టర్ హరీశ్ శంకర్ చెప్పారు. సమర్పకుడు చింతా గోపాల కష్ణారెడ్డి మాట్లాడుతూ, ‘ఈ సినిమాలో నాకు కూడా భాగస్వామ్యం కల్పించిన సతీశ్కి థ్యాంక్స్’ అని తెలిపారు. ‘కాన్సెప్ట్ బేస్డ్ సినిమా చేద్దామని చేసిన సినిమానే ఈ కథాకేళి. సాధారణంగా దెయ్యం కథలను అందరూ చెప్పి ఉంటారు. కానీ దెయ్యానికే కథ చెప్పాల్సి వస్తే.. అనేదే మా సినిమా. దిల్ రాజు చెప్పినట్లు డిఫరెంట్గా ప్రయత్నం చేసినప్పటికీ నా స్టైల్లో ఫ్యామిలీస్ అందరూ చూసి వారి పాత జ్ఞాపకాలను గుర్తుకు చేసుకునే కథ ఇది. ఇప్పటి యూత్కు నచ్చే కథ, అందరినీ నవ్వించే హారర్ కామెడీ ఉంది’ అని దర్శకుడు తెలిపారు.