నవతెలంగాణ- చెన్నై: బాలికను అపహరించి లైంగిక దాడి చేసిన ఘటన తమిళనాడులో ఆలస్యంగా వెలుగుచూసింది. ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. తిరుప్పూర్ జిల్లా పల్లడం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల బాలిక కేశవంపాళ్యం రోడ్డులో తన ప్రియుడితో మాట్లాడుతుండగా అటుగా వచ్చిన పల్లడం అన్నానగర్కు చెందిన రమేష్కుమార్, జాన్సన్, ఊంజపాళ్యానికి చెందిన పార్థిబన్ యువకుడిపై దాడి చేశారు. ఆపై పోలీసుస్టేషన్ కంటూ బాలికను ద్విచక్రవాహనంపై తీసుకెళ్లారు. కాళివేలంబట్టి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆ ఘటన అంతా వీడియో, ఫొటోలు తీశారు. విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించి, బాధితురాలిని పల్లడం- కోవై రోడ్డులో వదిలి వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లిన బాలిక జరిగిన దారుణాన్ని తల్లికి చెప్పింది. ఆ తర్వాత పోలీసులకు తెలియజేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ రోజు పల్లడం కోర్టులో హాజరుపరిచి రిమాండుకు తరలించారు.