నవతెలంగాణ- చందుర్తి
గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల వరద తాకిడికి కాల్వర్టులు తెగి ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. మండలంలోని ఎన్ గల్, అనంత పల్లి, మూడపల్లి, జోగాపూర్, బండపల్లి గ్రామాల పరిధిలో కాల్వర్టులు వర్షానికి దెబ్బతిన్నాయి. దింతో వాహన దారులు ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా మారింది. మరో వైపుగా రాత్రి వేళలో ద్విచక్ర వాహనదారులు ప్రయాణం చేయాలంటే జంకుతున్నారు. గతంలో చందుర్తి, లింగంపేట, మాల్యాల గ్రామాల కల్వర్టులలో అదుపు తప్పి పడి పోయిన ఘటనలు ఉన్నాయి.
రోడ్ పై నీరు తో ఇబ్బందులు
కోరుట్ల ,వేములవాడ ప్రధాన రహదారి పై వర్షాల కు గుంతలుగా ఏర్పడి నీరు నిల్వగా మారి వాహనాలు సైడ్ కు వెళ్లాల్సి వస్తుంది.దింతో ఎదురుగా వచ్చే వాహనా దారులు ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తుంది. మూడపల్లి, మర్రిగడ్డ, చందుర్తి, గ్రామాల పరిధిలో రోడ్లపై నీటి నిల్వలకు నిలయంగా మారింది. సంబంధిత అధికారిలు చొరవ చూపాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. ఏదేని ప్రమాదం జరుగా క ముందు తక్షణమే చర్యలు చేపట్టాలని వాహనదారులు అంటున్నారు.