– సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్
నవతెలంగాణ-మియాపూర్
తెలంగాణ రైతు సాయిధ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ అన్నారు. సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా ముఖ్య కార్యకర్తల శిక్షణా తరగతుల్లో భాగంగా శేర్లింగంపల్లి గచ్చిబౌలిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన క్లాసులను బోధించిన అనంతరం తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చాకలి ఐలమ్మ వర్ధంతి సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి ఏమాత్రం సంబంధంలేని ఆర్ఎస్ఎస్, బీజేపీి రజాకర్లకు వ్యతిరేకంగా హిందువులు పోరాటం చేశారని ఒక తప్పుడు ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తుందని ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ పోరాటం జరిగినప్పు డు తెలంగాణలో ఆర్ఎస్ఎస్, బీజేపీ వ్యక్తులు ఏ ఒక్కరోజు పోరాటంలో పాల్గొనక పోగా భూస్వామి, నైజం నవాబులకు తొత్తులుగా పనిచేశారని ఆయన ఆరోపిం చారు. తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా ఎన్నో భూ సమస్యలను పరిష్క రించి పేదలకు భూములు పంచిపెట్టిన చరిత్ర ఒక ఎర్రజెం డకు మాత్రమే దక్కుతుందని ఆయన గుర్తు చేశారు. తెలం గాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి మహిళ లోకం ముం దుకు తీసుకోవా ల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి కె భాస్కర్ నాయకులు పగడాల యాదయ్య, చంద్రమోహన్, జగదీష్, రవి, శోభన్, కష్ణ తదితరులు పాల్గొన్నారు.