నవతెలంగాణ- పెద్దకొడప్ గల్
15వ రోజుకు అంగన్వాడి టీచర్ల సమ్మె మండలంలోని అంగన్వాడీ టీచర్లు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గత 15 రోజులు గా సమ్మె బాట పట్టినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం విడ్డురంగా ఉందని అన్నారు. సోమవారం నాడు మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం వద్ద నుండి గాంధీ చౌక్ వరకు ర్యాలీగా వచ్చి జాతీయ రహదారిపై మానవహారం నిర్వహించి నిరశన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరవధికా సమ్మె 15వ రోజుకు చేరుకున్న తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం చాలా సిగ్గుచేటని అన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక స్కీములలో అనేకమంది ఉద్యోగులకు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నప్పటికీ,ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు నెలకు కనీసం లక్ష నుంచి 2 లక్షల జీతాలు ఇస్తున్నప్పటికి వారి కంటే ఎక్కువ సేవ నిరంతరం చేస్తున్నటువంటి అంగన్వాడీ టీచర్లకు, ఆయాలకు కనీస వేతనాలు ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడం ఏంటని మండిపడ్డారు. అంగన్వాడీలు ఉదయం నుంచి సాయంత్రం వరకు బాలింతలకు, గర్భవతులకు, చంటి పిల్లలకు ఒకటో సంవత్సరం నుండి 5 సంవత్సరాలలోపు ఉన్న పిల్లలకు తల్లితండ్రుల కంటే ఎక్కువ సేవ చేస్తున్నమని తెలిపారు. ప్రభుత్వం అంగన్వాడీలపై అనుసరిస్తున్న వైఖరి సరైన విధానం కాదని అన్నారు. అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కారం చేసి వీధుల్లోకి తీసుకొవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వం తమకు ఉద్యోగ భద్రత కల్పించే వరకు నిరసన కార్యక్రమం ఆపబోమని స్పష్టం చేశారు. కనీస వేతనం 26000 రూపాయలు ఇవ్వాలని పెన్షన్ .ఈ.ఎస్.ఐ. రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇచ్చి ఐదు లక్షల ప్రమాదం భీమా కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్స్ చంద్రకళ, పద్మ,జ్యోతి, రేణుక, కమల, చంద్రకళ, హెల్పర్స్ వర్కర్ పాల్గొన్నారు.