![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230909-WA0059.jpg)
నవతెలంగాణ -కంటేశ్వర్
ప్రభుత్వం వడ్లను కొనుగోలు చేసిన ధర కంటే ఎక్కువ ధరకే విక్రయించాలని మాజీమంత్రి సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం మాజీ మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి వారి నివాసంలో పత్రిక సమావేశం నిర్వహించి విలేకరులతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర కావాలని అప్పుడే రైతులు సంతోషంగా ఉంటారని భావించి 560 రూపాయలు ఉన్న వడ్ల ధరను 1400 రూపాయలకు ప్రభుత్వమే కొనుగోలు చేసిందని,430 రూపాయలు ఉన్న మక్కల ధరను 1200 రూపాయలు చేసిందని, ఒకవేళ ప్రభుత్వం కాకుండా వ్యాపారులు రైతుల దగ్గర నుండి వడ్లు,మక్కలు కొనుగోలు చేస్తే గిట్టుబాటు ధర ఇవ్వరని భావించి కొనుగోలు సెంటర్లు ప్రారంభించి వడ్లు కొనుగోలు చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని ఆయన అన్నారు. కానీ ప్రస్తుతం ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుల సంతోషాన్ని నీరుగారుస్తూ కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన వడ్ల కొనుగోలు వ్యవస్థను నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నిస్తుందని ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసే విధంగా ప్రయత్నిస్తుందని ఇటీవల రైతుల దగ్గర నుండి 1800 రూపాయలకు కొనుగోలు చేసిన మక్కలను కేసీఆర్ వారికి కావలసిన మనుషులకు 1300 రూపాయలకే అమ్ముకున్నాడని, తద్వారా ప్రభుత్వం నష్టాల్లోకి వెళుతుందని ,అదేవిధంగా ఇప్పుడు రాష్ట్రంలో నిల్వ ఉన్న వడ్లను విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నాడని అందుకుగాను ఐదు లక్షల టన్నులు ఒక్కరే కొనుగోలు చేయాలని వారి టర్నోవర్ 1000 కోట్లు ఉండాలని కండిషన్ పెట్టారని, ఇది కేవలం ప్రజల డబ్బును అక్రమంగా దోచుకున్న బిఆర్ఎస్ పార్టీ మనుషులకే సాధ్యమవుతుందని ఆయన అన్నారు. కానీ ప్రభుత్వం వడ్లు అమ్మకాలు జరపాలంటే రైతుల దగ్గర్నుంచి కొన్న ధర కంటే ఎక్కువ కు విక్రయిస్తే ప్రభుత్వానికి లాభం ఉంటుందని ,అదేవిధంగా వేరే రాష్ట్రాలకు ఎగుమతులను నిలిపివేశారని ప్రస్తుతం ఆంధ్రలో నీరు లేక పంటలు పండడం లేదని వాటిని దృష్టిలో ఉంచుకొని ఎగుమతులు ప్రారంభించి ప్రభుత్వం కొన్న ధర కంటే ఎక్కువ ధరకే వడ్లను అమ్మాలని సుదర్శన్ రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఇలాంటి విధంగా తప్పుడు ఆలోచనతో ముందుకు వెళితే కొనుగోలు వ్యవస్థ దెబ్బ తింటుందని తద్వారా రైతులు నష్టపోయే అవకాశం ఉంది కావున రైతులు దీనిని గమనించాలని సుదర్శన్ రెడ్డి అన్నారు.ఈ సమావేశంలో పిసిసి ఉపాధ్యక్షులు తహేర్ బిన్ హందన్,మాజీ ఎమ్మెల్సీ అరికేళ నర్సారెడ్డి,జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు అంతీ రెడ్డి రాజ రెడ్డి పాల్గొన్నారు.