– వరద బాధిత రైతాంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి అమలు చేయాలి.
– ముంపు బాధితుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్తా
– జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి
– వరద ముంపు ప్రాంతాల్లో సర్వే
నవతెలంగాణ -తాడ్వాయి
వరద ప్రభావిత ప్రజానీకాన్ని ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని అదేవిధంగా వ్యవసాయ భూములు మరియు పంటలు నష్టపోయిన రైతాంగానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి ఆదుకోవాలని జాతీయ మిర్చి టాస్క్ ఫోర్స్ కమిటీ డైరెక్టర్ నాసిరెడ్డి సాంబశివరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం ఆయన ఇటీవల కురిసిన భారీ వర్షాలతో నష్టపోయిన తాడువాయి మండలంలోని మేడారం రెడ్డిగూడెం ఊరట్టం తదితర గ్రామాల్లో పర్యటించి బాధితుల గోడు విన్నారు వ్యవసాయ పంట పొలాలను పరిశీలించి వరి నారుమడులపై భారీ వరదల వల్ల వంట పొలాలలో ఇసుక మేటలు వేయడంతో పాటు జంపన్న వాగు తీరం వెంబటి వ్యవసాయ భూములు కోతకు గురి కావడాన్ని సాంబశివరెడ్డి స్థానిక రైతులతో కలిసి పరిశీలించారు వందలాది ఎకరాలు పచ్చని పంట పొలాలు సాగుకి పనికి రాకుండా పోవడం పట్ల ఆయన ఆవేదన వ్యక్తం చేశారు కష్టకాలంలో అన్నదాతలు మరియు వరద బాధితులు ధైర్యంగా ఉండాలని తామంతా అండగా ఉంటామని సాంబశివరెడ్డి భరోసా ఇచ్చారు ఇప్పటికే ఆగస్టు మాసం వచ్చేసినందువల్ల సాగుకి పనికి వచ్చే వ్యవసాయ భూములలో స్వల్పకాలిక వరి వంగడాలని మాత్రమే సాగు చేసుకోవాలని రైతులకు సూచించారు గృహ విద్యుత్ సరఫరా ఇప్పటికే ప్రారంభించారని కానీ వ్యవసాయ విద్యుత్తు సరఫరాను వెంటనే పునరుద్ధరించాలని దీనికోసం అవసరమైన ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడంతో పాటు విరిగిపోయిన విద్యుత్తు స్తంభాలను వెంటనే కొత్తవి ఏర్పాటు చేయాలని సాంబశివరెడ్డి విద్యుత్ అధికారులకు విజ్ఞప్తి చేశారు వరద ప్రభావిత గ్రామాల్లో సమర్థవంతంగా సేవలందించిన ప్రభుత్వ అధికారులు విద్యుత్ రెవిన్యూ పోలీస్ వైద్య మరియు ఆరోగ్య గ్రామపంచాయతీ సిబ్బంది మరియు పారిశుధ్య కార్మికులను సాంబశివరెడ్డి అభినందించారు యండి ఆర్ యఫ్ బృందాల సేవలు మర్చిపోలేనివి అన్నారు ఈ సందర్భంగా సాంబశివరెడ్డి మాట్లాడుతూ వరద ముంపు బాధితులు మరియు రైతుల సమస్యలను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని అదేవిధంగా బాధితుల సమస్యలపై త్వరలోనే రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ నీ కలిసి చర్చిస్తానన్నారు వరథ ప్రభావంతో మృతి చెందిన కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్స్ గ్రేసియ ప్రభుత్వం చెల్లించాలని వరద ముంపు కి గురైన బాధిత కుటుంబాల అందరికీ శాశ్వత ప్రాతిపదికన పక్కా ఇల్లు నిర్మించి ఇవ్వటంతో పాటు తక్షణ సహాయంగా కుటుంబానికి రూ ముప్పై వేలు ఆర్థిక సాయం అందించాలని ఇసుక మేటలు వేసిన వ్యవసాయ భూములకు ఎకరానికి రూ యాభై వేల ప్రత్యేక ఆర్థిక సహాయం అందిస్తూ అదనంగా దీర్ఘకాలిక రుణాలను మంజూరు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.