![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230821-WA0566.jpg)
నవతెలంగాణ – మీర్ పేట్
ప్రతిరోజు ప్రతి ఇంటికి మంచినీళ్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ దుర్గా దీప్ లాల్ చౌహన్ అన్నారు. సోమవారం మీర్ పేట్ మున్సిపల్ కార్పోరేషన్ 45వ డివిజన్ పరిధిలో రూ 8లక్షల నిధులతో నిర్మాణం చేస్తున్న మంచినీటి పైపు లైన్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతి ఇంటికి రోజు మంచినీళ్లు ఇవ్వడమే లక్ష్యంగా మిషన్ భగీరథతో పథకంతో ముందుకు వెళ్తున్నామని అన్నారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి సహకారంతోనే కార్పొరేషన్ అభివృద్ధి పథంలో నడుస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ వాణి, డిఈ గోపీనాథ్, ఎఈ శ్రీనివాస్, కార్పొరేటర్లు అక్కి మాధవి, కీసర గోవర్ధన్ రెడ్డి, పెండ్యాల నర్సింహా, వాటర్ వర్క్స్ ఎఈ వివేక్ తదితరులు పాల్గొన్నారు.