![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230724-WA0003.jpg)
నవతెలంగాణ కంటేశ్వర్
బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయని కాంగ్రెస్ నాయకులను అక్రమ అరెస్టులు చేయడానికి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండిస్తూ మండిపడ్డారు. ఈ మేరకు సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులను అక్రమంగా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులు అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి కాంగ్రెస్ భవన్ నందు విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని జిల్లాలలో రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధులతో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించి వాటి డోళ్ళతనాన్ని ప్రజలకు వివరించే కార్యక్రమంలో భాగంగా నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మహేష్ కొనగల ఇన్చార్జిగా రావడం జరిగిందని ఆయన అన్నారు. 8 సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రతి నియోజకవర్గంలో 5000 వరకు ఆర్భాటంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను మంజూరు ఇప్పటివరకు ఒక్కటి కూడా పూర్తిస్థాయిలో నిర్మించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని, అందుకే ఈరోజు మహేష్ కొనగల ఆధ్వర్యంలో నిజామాబాద్ నగరంలోని డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడానికి వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు నగర కాంగ్రెస్ అధ్యక్షులు కేశవేణు, టీపీసీసీ ఉపాధ్యక్షులు తాహిర్బిన్ హమ్ దన్ ,పిసిసి ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్,పిసిసి ప్రధాన కార్యదర్శి ప్రేమలత అగర్వాల్,కార్పొరేటర్ గడుగు రోహిత్, అనుబంధ విభాగాల అధ్యక్షులను,మహిళలు అని పెద్దవాళ్ళు అని చూడకుండా ఎక్కడ రాష్ట్ర ప్రభుత్వం డోల్లతనం బయట పడుతుందో అని ఆప్రజాస్వామికంగా అరెస్టు చేయించారని, ఇది ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని దీనిని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని మానాల మోహన్ రెడ్డి అన్నారు. నిన్నటి ముచ్చటగా మూడు రోజులు కూడా నడవని రివర్స్ పంపింగ్ను గ్రామాల నుండి బస్సులు పెట్టి ప్రజలను తీసుకువెళ్లి చూయించిన మంత్రి ప్రశాంత్ రెడ్డి ఈరోజు ఎందుకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను పరిశీలించడానికి వెళ్లిన కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయించాడని మానాల మోహన్ రెడ్డి ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ పిసిసి డెలిగేట్ శేఖర్ గౌడ్, జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నీరడి భాగ్య, జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు మీసాల సుధాకర్ రావు, దయాకర్ గౌడ్, ఆర్మూర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ ,నగర ఎస్టి సెల్ అధ్యక్షుడు సుభాష్ జాదవ్ నారాయణ గౌడ్ పాల్గొన్నారు.