![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/07/IMG-20230718-WA0026.jpg)
నగరంలోని మున్సిపల్ కార్యాలయంలోని మేయర్ ఛాంబర్ లో ఇంజనీరింగ్, శానిటేషన్ ఆదికారులతో సమీక్ష సమావేశం నిర్వహించినట్లు మేయర్ దండు నీతూ కిరణ్ మంగళవారం తెలిపారు. వర్ష కాలం దృష్ట్యా రాబోవు రెండు రోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున లోతట్టు ప్రాంతాలకు చేరే నీటిని నాలాల ద్వారా దారి మల్లించి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అవసరం ఉన్న చోట్ల తాత్కాలిక కాలువలను తవ్వి నీరు నివాస సముదయాలలో చేరకుండా జాగ్రత్త చర్యలు చేపట్టాలని తెలిపారు. వర్షపు నీరు మురికి కాలువల ద్వారా మల్లించేప్పుడు ఎక్కడ త్రాగు నీరు మురికి నీటితో కలుషితం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మంచి నీటి పైప్ లైన్ లికేజిలను తక్షనమే అరికట్టాలని వర్షాలతో పాటు ఇతర విష జ్వరాలు ప్రబలకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో ఎగ్జిక్యూటివ్ యస్ఇఎం, ఇడిఇలు ఎఇలు, ఎంహెచ్ఓ, శానిటేరి ఇన్స్పెక్టర్లు ఇతర సిబ్బంది పాల్గొన్నారు.