![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/Untitled-169.jpg)
ప్రమాదవశాత్తు కెనాల్ కాల్వలో కాలు జారి పడి గల్లంతైన ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలొ బుధవారం చోటు చేసుకుంది. ఎస్సై పాకాల లక్ష్మారెడ్డి, తెలిపిన కథనం ప్రకారం.. శంకరపట్నం మండల పరిధిలోని కొత్తగట్టు గ్రామానికి చెందిన వేముల రాములు (61) కేశవపట్నం పోలీస్ స్టేషన్ కొత్తగట్టు గ్రామానికి చెందిన రాములు అకస్మాత్తుగా కెనాల్ కాలువలో కాలు జారి పడి గల్లంతయినట్లు,భార్య తెలిపిన సమాచార వివరాల్లోకి వెళితే ఇలా ఉన్నాయి. రోజువారీగా మార్నింగ్ వాకింగ్ కు వెళ్లి వస్తానని గంటలు సమయం గడిచిన తిరిగి రాకపోవడంతో ఇంటి వద్దనే తన భార్య వేముల లక్ష్మి వేచి చూస్తుండగా అటుగా వెళుతూ, అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి నీ భర్త చెప్పులు వెన్నంపల్లి ,కెనాల్ వాగు వద్ద ఉన్నాయని సమాచారం తెలుపగా భార్య హుటాహుటిన పలువురు గ్రామస్తులను తీసుకొని ఘటన స్థలానికి చేరుకోగా కెనాల్ వద్ద ఉన్న భర్త చెప్పులను చూసిన ఆమె చుట్టుపక్కల వెతికిన దొరకకపోయే సరికి నా భర్త ఎక్కడో తప్పిపోయాడని కేశవపట్నం పోలీసులకు ఫిర్యాదు చేయగా ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. నా భర్త ఇంటి వద్ద నుంచి గులాబీ రంగు గల షాట్ బ్లాక్ కలర్ షర్ట్ ధరించి వెళ్లాడని కేశవపట్నం పోలీస్ స్టేషన్లో భార్య వేముల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు, ఎస్ఐ లక్ష్మారెడ్డి, తెలిపారు.