– గజ్జల యోగానంద్ ఫౌండేషన్ ద్వారా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు దాఖలు
రైల్వే అండర్పాస్ ముంపు ప్రాంతాల సమస్య పరిష్కరించాలి
శేరిలింగంపల్లి రైల్వే అండర్పాస్ ముంపు ప్రాంతాలకు సంబంధించిన సమస్యను పరిష్కరిం చాల్సిందిగా గజ్జల యోగానంద్ ఫౌండేషన్ నేషనల్ తరుపున గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు దాఖలు చేసింది. దానికి అనుగుణంగా ”సౌత్ జోన్ బెంచ్” నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, రైల్వే అండర్పాస్ ముంపు ప్రాం తాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించే విధంగా 4 వారాల్లో ఫిర్యాదుదారున్ని, సంప్రదించి, ముంపు ప్రాంతాలను సందర్శించి, సంపూర్ణ నివేది కను ఇవ్వాలని జిహెచ్ఎంసిని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని యోగానంద్ తెలిపారు. ఆదివారం గచ్చిబౌలిలోని రాడిసన్ హౌటల్లో ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో అయన మాట్లాడు తూ..శేరిలింగంపల్లి రైల్వే అండర్పాస్ వరద ప్రాం తాలను సంబంధించిన, సమస్యలను పరిష్కరిం చ డంలో నియంత్రించడంలో రెండు ముఖ్యమైన నీటి వనరులలో ఆక్రమణల సమస్యను పరిష్కరిం చడంలో జిహెచ్ఎంసి అధికారుల నిర్లక్ష్య వైఖరి పట్ల కేసు దాఖలు చేసినట్టు గజ్జల యోగానంద్ ఫౌండేషన్ ట్రస్టీ గజ్జల యోగానంద్ తెలిపారు. 3714-గోపి చెరువు 3719-చాకలవాని చెరువు, వీటితో పాటు వాటి ఫుల్ ట్యాంక్ లెవెల్, బఫర్ జోన్, పరిరక్షణ విషయంలో నిర్లక్ష్య వైఖరి, ఆక్రమ ణల వల్ల తీవ్రమైన వరద సమస్యకు దారితీస్తు న్నాయని తెలిపారు.
గోపి చెరువు, చాకలవాని చెరువు రెండింటి లోని ఎఫ్టిఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణలు జరుగుతున్నాయని గట్టి ఆధారాలు ఉన్నప్పటికీ, ఈ నిర్మాణ కార్యకలాపాలను ఆపడానికి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని, ఎంఆర్ఓ కార్యాలయానికి సమీపంలోని రైల్వే అండర్పాస్, అలాగే జిహెచ్ఎంసికి చెందిన జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ కార్యాలయాలు సమీపంలో ఉన్నపటికీ చర్యలు తీసుకోకపోవడం, నిబంధనలు అమలు చేయకపోవడం మొదలగు వాటి గురించి ఈ కేసులో పొందుపరిచామన్నారు. అధికారుల అసమర్థత కారణంగా ఇప్పటికే ఉన్న పర్యావరణ పరిరక్షణ, ఆక్రమణలకు గురైన నీటి వనరులను, ముఖ్యంగా గోపి చెరువు, చాకలవాని చెరువుల పునరుద్ధరణ కోసం వారి ఫౌండేషన్ (గజ్జల యోగా నంద్ ఫౌండేషన్) తరుఫున గౌరవ ట్రిబ్యునల్ను ఆశ్రయించడం జరిగిందని యోగానం ద్ తెలిపారు. ఈ సమస్యను పరీష్కరించే దిశగా కేసును పరిగ ణలోకి తీసుకొని, 4 వారాలలో నివేదికను సమర్పిం చాలని జిహెచ్ఎంసిని ఆదేశిం చిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ సౌత్ జోన్కు గజ్జల యోగానంద్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.