– కాంగ్రెస్, బీజెపీ, బీఎస్పీ, ఏఐఎస్బీ మండల నాయకుల సంఫీుభావం
నవతెలంగాణ-కోహెడ
గ్రామపంచాయితి కార్మికుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కాంగ్రెస్, బీజెపీ, బీఎస్పీ మండల నాయకుల ఆధ్వర్యంలో జీపీ కార్మికులకు సంఫీుభావం తెలిపారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ సమీపంలో గ్రామపంచాయితి కార్మికులు చేస్తున్న సమ్మె ఎనిమిదోవ రోజుకు చేరుకున్న సందర్భంగా బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జన్నపురెడ్డి సురేందర్రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంద ధర్మయ్య, బీఎస్పీ నియోజకవర్గ నాయకుడు రాజు, మండల అధ్యక్షుడు వేల్పుల మహేష్, ఏఐఎస్బీ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్గౌడ్ల ఆధ్వర్యంలో వేరువేరుగా సంఫీుభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వరాష్ట్రంలో ఉద్యోగులను రెగ్యూలర్ చేస్తామని ఇచ్చిన హామిని ప్రభుత్వం ఆదమరిచిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైన గ్రామపంచాయితి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్, బీజెపీ, బీఎస్పీ నాయకులు కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బస్వరాజు శంకర్, బీజెపి మండల అధ్యక్షుడు ఖమ్మం వెంకటేశం, ఎంపీటీసీ బోయిని జయరాజు, మాజీ సర్పంచ్ శెట్టి సుధాకర్, ప్రధాన కార్యదర్శి, స్థానిక వార్డు సభ్యుడు వేల్పుల వెంకటస్వామి, బందెల బాలకిషన్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు చింతకింది శంకర్, ఉపాధ్యక్షుడు గూడ స్వామి, యూత్ అధ్యక్షుడు దూలం శ్రీనివాస్ గౌడ్, సోషల్ మీడియా కో.ఆర్డినేటర్ మహ్మద్ అబ్దుల్ రఫి, నంగునూరి శ్రీనివాస్, ఎఐఎస్బీ నియోజకవర్గ కన్వీనర్ పచ్చిమట్ల రవీందర్గౌడ్, మండల కన్వీనర్ గడిపే సుజిత్ కుమార్, జీపీ సిబ్బంది మండల అధ్యక్షుడు మెట్టు వెంకటరెడ్డి, తలారి అనిల్, తదితరులు పాల్గొన్నారు.