నవతెలంగాణ -కరీంనగర్: జగిత్యాల జిల్లాలో ఘోర ప్రమాదం తప్పింది. బుధవారం ఉదయం మెట్పల్లి నుంచి ఖానాపూర్ సుమారు 25 మంది ప్రయాణికులతో బయల్దేరిన ఆర్టీసీ బస్సు మల్లాపూర్ మండలం మొగిలిపేట ఓబులాపూర్ గ్రామాల మధ్య ఉన్న వంతెన వద్ద ప్రమాదవశాత్తు టైరు పేలి రోడ్డు కిందికి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.