![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/09/IMG-20230906-WA0009.jpg)
నవతెలంగాణ- హుస్నాబాద్ రూరల్
కార్మికుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ అన్నారు. బుధవారం హుస్నాబాద్ లో 17వ వార్డులో రూ.10లక్షల వ్యయంతో నిర్మించనున్న భవన నిర్మాణ కార్మిక తాపీ సంఘ భవనానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్నారని అన్నారు .దేశంలోని ఏ రాష్ట్రంలో లేనటువంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తూ కార్మిక, కర్షక ,సబ్బండవర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఆకుల రజిత వెంకన్న, కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.