నవతెలంగాణ- జూబ్లీహిల్స్
మధుర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రైవేట్ బ్యాంకు ఎటిఎం ను ధ్వంసం చేసిన సంఘటన ఈరోజు ఉదయం నాలుగు గంటల నుండి 5 గంటల మధ్య జరిగింది. మధురానగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం, ఎస్సార్ నగర్ పరిధిలోని వెంగళరావు నగర్ డివిజన్లో గల ఎక్వితాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఏటీఎం ను, అడ్డా కూలీగా జీవిస్తున్న సూర్యాపేట జిల్లా కోదాడ మండలం కాపుగల్లు విలేజ్ కి చెందిన చెన్నూరి తిరుపతయ్య(43) హైదరాబాదులో నివసిస్తూ, శనివారం ఉదయం నాలుగు గంటలకు ఏటీఎం లోపలికి వెళ్లి ఒక గంట పాటు ఏటీఎంను ధ్వంసం చేయుటకు ప్రయత్నించి చివరకు బయటకు రావడం జరిగింది .ఉదయం 8 గంటలకు బ్యాంకు సిబ్బంది బి శివరాం కృష్ణ ధ్వంసమై ఉన్న ఏటీఎం ను గమనించి అతని పై అధికారులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే ఉదయం 8:30 కు బ్యాంకు అధికారులు మధురానగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు యూసుఫ్ గూడా పరిసరాలలో తిరుగుతుండగా సీసీ కెమెరాలు ఆధారంగా నిందితుడిని గుర్తించి అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగింది. అతనిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. కొన్ని గంటల వ్యవధిలోనే నిందితుడిని అరెస్ట్ చేసిన అధికారులను సిబ్బందిని అభినందించారు.