![](https://dev.navatelangana.com/wp-content/uploads/2023/08/IMG-20230802-WA0025.jpg)
– ఆటోలలో స్పీకర్స్ పెడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటాం
– నిజామాబాద్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్
నవతెలంగాణ – కంటేశ్వర్
నిజామాబాద్ వర్ని చౌరస్తాలో బుధవారం ట్రాఫిక్ పోలీసులు వాహనా తనిఖీలు నిర్వహించారు. ఆటోలో స్పీకర్లు పెట్టుకున్న 15 వాహనాలకు ఫైన్ విధించారు. జరిమానాలు విధించడమే కాకుండా నియమ నిబంధనలను పాటించాలని అవగాహన కల్పించారు. నిబంధనలను పాటించని 15 వాహనాలకు సంబంధించిన స్పీకర్లను తొలగించి నిర్మాణాలను విధించి చట్ట ప్రకారంగా చర్యలు తీసుకుంటామని ఆటోవాలాలకు హెచ్చరించారు. తూచా తప్పకుండా ఆటోవాలాలు సైతం ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలన్నారు లేని యెడల నిజమాబాద్ పోలీస్ కమిషనర్ యాక్ట్ ప్రకారం విధించడమే కాకుండా కేసులు నమోదు చేసి అవసరమైతే వాహనాలను సీజ్ చేస్తామన్నారు. ఆటోలో ఎక్కువ మందిని ఎక్కించుకున్నా, డ్రైవర్ పక్కన ప్యాసింజర్స్ ఉన్నా ఫైన్ వేస్తామని పోలీసులు హెచ్చరించారు. ఈ తనిఖీలలో ట్రాఫిక్ ట్రాఫిక్ సిఐ చందర్ రాథోడ్ తో పాటు ట్రాఫిక్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.