నవతెలంగాణ-ఆర్మూర్
భారతావని సొంతం యోగ ఆరోగ్యం ఆనందం వెన్నంటి ఉండాలంటే యోగాసనాల ద్వారానే సాధ్యమని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో చెబుతున్న మాట. ప్రస్తుతం ఒక 173 దేశాలలో యోగ సేవలు చేస్తున్నారు. యోగా ,ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత పొందుతున్నారు ప్రతి సంవత్సరం జూన్ 21వ తేదీన యోగ దినోత్సవాన్ని నిర్వహించాలని సంకల్పించింది ఐక్యరాజ్యసమితి 2017 నుండి యోగ దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడం మొదలైంది.
మారుతున్న కాలంలో….
మారుతున్న కాలంలో యాంత్రిక జీవనంలో ఆసనాలు అంతరించాయి క్రమేన కొందరు గురువులు దీనిని ఆచరణలోకి తెచ్చేందుకు నిరంతరం శిక్షణ తరగతులు నిర్వహించారు.. క్రమక్రమంగా ప్రస్తుతం ఎక్కువ శాతం వాడుకలోకి వచ్చేసింది.. కొన్ని ప్రైవేటు పాఠశాలలు ప్రత్యేకంగా యోగ టీచర్లను నియమించి క్లాసులు చెప్పిస్తుండడం గమనరహం. చిన్నారులు మొదలు వృద్ధుల వరకు యోగాసనాలు ప్రాణాయామం చేస్తూ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు….
యోగాసనాలు చేయడం ఎలా…
రెండు నిమిషాలలో ఏదైనా ఒక ధ్యాన ఆసనంలో కూర్చుని నమస్కారం ముద్రతో ప్రారంభించి యోగ ముద్రాసనంతో ముగించాలి… ఆరు నిమిషాల చలన క్రియలు ,,18 నిమిషాలు నిలబడి చేసే ఆసనాలలో తడాసనం, వృక్షాసనం, పాదాస్థానం అర్థ చక్రాసనం, త్రికోణ ఆసనం కూర్చుండి చేసే ఆసనాలలో బద్ద కునాసనం, వజ్రాసనం, అర్థ ఊశ్నాసనం ,వక్రాసనం. బోర్లా పడుకుని చేసే ఆసనాలలో భుజంగాసనం, చిల శాసనం, మకరాసనం, విలకిల పడుకొని చేసే ఆసనాలలో సేతు బందాసనం, ఉత్తష్ట పాదాసనం అర్థవలాసనం ,,మూడు నిమిషాల కపాల జాతి ఒక్కో రౌండ్ కు 40 సార్లు చొప్పున 3 రౌండ్లు చేయించాలి .ఆరు నిమిషాల ప్రాణాపాయంలో నాడీ శోధన అనులోమ విలోమం ,,8 నిమిషాల ధ్యానంలో కళ్ళు మూసుకొని ఏదైనా ధ్యాన ఆసనంలో కూర్చుని ధ్యానముద్రలు ,చేతులు పెట్టాలి. రెండు నిమిషాల సంకల్పంలో ప్రతిజ్ఞ చేయించి చివరికి ముగింపులో శాంతి మంత్రాన్ని నేర్పించాలి.
జిల్లా కేంద్రంలోని 30 మందితో మొదలై…
1983వ సంవత్సరంలో జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో శ్రీ దయానంద యోగా కేంద్రం పేరుతో యోగ కేంద్రాన్ని స్థాపించారు.. ముక్క దేవేందర్ గుప్తా ఆధ్వర్యంలో కమిటీగా ఏర్పాటు చేసి ట్రస్ట్ గా దీనిని ప్రారంభించారు.. 30 మంది సభ్యులతో ప్రారంభమై ఈ కేంద్రంలో ఇప్పటికి కొన్ని వందల మంది శిక్షణ పొందుతున్నారు.. మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఈ కేంద్రంలో శిక్షణ పొందిన పలువురు వివిధ ప్రాంతాల్లో యోగా టీచర్లుగా ఉంటున్నారు .సుమారుగా 200 మంది యోగాలు డిప్లమో పొందినవారు ఉన్నారు. 1987 సంవత్సరం ప్రపంచమంగ జిల్లా కేంద్రంలోని కర్షక్ భవన్లో జిల్లాస్థాయి యోగాసన పోటీలు నిర్వహించినారు. 1989 లో జాతీయస్థాయి న్యాయ నిర్ణీతల రాత పరీక్షల్లో జిల్లా సంగం బాధ్యులు పరీక్షల్లో ఉత్తీర్ణులై నిర్నేతలుగా గురువులు గాను వ్యవహరిస్తున్నారు. వీరు ఆయా పాఠశాలలో శిక్షణ ఇస్తూ విద్యార్థులను యోగాసనాలు తీర్చిదిద్దుతున్నారు .ఈ నేపథ్యంలో జిల్లాకు జాతీయస్థాయిలో స్వర్ణ పథకాలు 40కి పైగా రజిత కాంస్య పథకాలను సాధించారు.
ఉత్తమ లక్షణాలను ఇస్తుంది…
యోగ సాధనను అలవర్చుకోవడంతో వ్యక్తిత్వంలో ఉత్తమ లక్షణాలు మెరుగవుతాయి. దీంట్లో ఆలోచన శక్తి పెరిగి అన్నింటిలో రాణించే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. యోగ సాధన తో శరీరంలో ఆరోగ్యపరమైన అంశాలను పూర్తిస్థాయిలో అనుభవించగలుగుతాం…
ఎంతోమంది ప్రజల్లో అవగాహన పెరిగింది..
ఒకప్పుడు యోగాను ఆచరించేవారు స్వల్ప సంఖ్యలు ఉండేవారు. రాను రాను ఎంతోమంది ప్రజల్లో యోగాపై అవగాహన పెరిగింది. కుల మతాలకు అతీతంగా అన్ని వర్గాల వారు యోగాను ఆచరించవచ్చు .దీంతో ఆరోగ్యం కాపాడుకోవడమే కాకుండా మనసును అదుపులో ఉంచుకొని సామర్ధ్యాలు మెరుగవుతాయి..
పండిత్ పవన్ బి ఆర్ ఎస్ నాయకులు ఆర్మూర్
జిల్లా కేంద్రంలో….
అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని పతాంజలి యోగ సమితి ఆధ్వర్యంలో సుభాష్ నగర్ లోని సమితి కార్యాలయంలో కరపత్రాలను ఆవిష్కరించి అవగాహన కల్పించినారు యోగ సాధకులు.. . ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ కు చెందిన రాజేందర్ గత 15 సంవత్సరాల నుండి వివిధ పాఠశాలలకు కళాశాలల విద్యార్థులకు యోగ పై అవగాహన కల్పిస్తూ పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.