నవతెలంగాణ-భిక్కనూర్
విశ్వవిద్యాలయం, దక్షిణ ప్రాంగణంలో, యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ రెగ్యులర్ చేయాలని, రెగ్యులర్ చేసే వరకు ఆందోళన ఆగదని తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ నారాయణ గుప్తా మాట్లాడుతూ.. విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్న కాంట్రాక్ట్ అద్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని నిన్న అసెంబ్లీలో మాట్లాడిన శాసనసభ సభ్యులు గాదారి కిషోర్ మాట్లాడుతూ.. జీవో నెంబర్ 16 ప్రకారం డిగ్రీ, జూనియర్ కళాశాలలో, ఏ విధంగా రెగ్యులర్ చేశారొ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకులను కూడా రెగ్యులరైజ్ చేయాలని, ఎంతగానో అభివృద్ధికి సహకరిస్తున్నారని, తమ సమస్యను రాష్ట్రంలో పనిచేస్తున్న 400 మంది కాంట్రాక్ట్ అధ్యాపకులను రెగ్యులరైజ్ చేయాలని శాసనసభలో విద్యాశాఖ మంత్రి దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. యూనివర్సిటీ ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్తున్నటు వంటి ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, రైతుబంధు చైర్మన్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, మీ సమస్య పరిష్కారానికి తమ వంతు కృషి చేస్తామన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి ఆదేశాలను రాష్ట్ర అధికారులు, విద్యాశాఖ ప్రతినిధులు వెంటనే తమ సమస్య పై దృష్టి సారించి రెగ్యులరైజేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ యాలాద్రి, డాక్టర్ నరసయ్య, డాక్టర్ రమాదేవి, డాక్టర్ సునీత, డాక్టర్ నిరంజన్ శర్మ, డాక్టర్ సరిత, శ్రీకాంత్, శ్రీమాతా, దిలీప్ తదితరులు ఉన్నారు.