నవతెలంగాణ – సిద్దిపేట
స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఖొ-ఖొ విజేతలు అండర్ 14 బాలికల విభాగంలో మొదటి స్థానంలో జగదేవ్ పుర్, రెండవ స్థానంలో సిద్దిపేట రూరల్, మూడవ స్థానంలో సిద్దిపేట అర్బన్ మండలాలు నిలిచినట్లు ఎస్ జి ఎఫ్ సెక్రెటరీ రామేశ్వర్ రెడ్డి తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ అండర్ 17 క్యాటగిరీలో మొదటి స్థానం జగదేపూర్, రెండవ స్థానం కుక్కునూరు పల్లి, మూడవ స్థానంలో సిద్దిపేట అర్బన్ మరియు దుబ్బాక లు నిలిచినట్లు తెలిపారు. వాలీబాల్ పోటీలలో అండర్ 14 బాలికల విభాగంలో గజ్వేల్ మొదటి స్థానం, నంగునూరు రెండవ స్థానం, రాయపోలు మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. అండర్ 17 బాలికల విభాగంలో దుబ్బాక మొదటి స్థానం, దౌల్తాబాద్ రెండో స్థానం, నంగునూరు మూడో స్థానంలో నిలిచినట్లు తెలిపారు. క్రీడలలో విద్యార్థినిలు మంచి పోరాట స్ఫూర్తిని చూపించారని అన్నారు.