నవతెలంగాణ – అమరావతి : ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు పాదచారులు మృతి చెందారు. అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం పాదచారులపై దూసుకెళ్లడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం పంపనూరు గ్రామం వద్ద రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న వారిని బొలెరో వాహనం ఢీకొట్టి ఎదురుగా వస్తున్న మరో కారును ఢీ కొట్టి నిలిచిపోయింది. ఈ ఘటనలో పాదచారులు ముగ్గురు మరణించగా, కారులో ప్రయాణిస్తున్న ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. బొలెరో డ్రైవర్ మద్యం మత్తులో ఉండడం వల్లే ప్రమాదం జరిగిందని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతదేహాలను, గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.