నవతెలంగాణ – చిత్తూరు: చిత్తూరు శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. చెర్లోపల్లి వద్ద డివైడర్ను కారు ఢీ కొన్న ఘటనలో ముగ్గురు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తీవ్ర గాయాలపాలైన డ్రైవర్ను దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. తిరుమల నుంచి మైసూర్కు వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం.