నవతెలంగాణ – తిరుమల: తిరుమల అలిపిరి నడక మార్గంలో ఏడో మైలు వద్ద మూడేండ్ల బాలుడిపై దాడిచేసిన చిరుతపులి బోనులో చిక్కింది. దాడి అనంతరం చిరుతను పట్టుకోవడానికి అధికారులు నడక దారిలో రెండు బోన్లు, 150 ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దీంతో శుక్రవారం రాత్రి 10.45 గంటల సమయంలో చిరుతపులి బోనులో చిక్కిందని అధికారులు తెలిపారు. దానికి ఏడాదిన్నర వయసు ఉంటుందని చెప్పారు. అయితే ఒక్కరోజులోనే చిరుతను బంధించడంతో భక్తులు ఊపిరిపీల్చుకున్నారు.