జిడ్డు తొలగిపోవాలంటే…

ఏదైనా పని మీద కొంచెం సేపు బయటకు వెళ్ళి వచ్చినా.. ఎండల వేడికి చెమట పట్టేస్తుంది. ముఖమంతా జిడ్డుగా అయిపో తుంది. ఫలితంగా ముఖం కళ తప్పి నల్లగా టాన్‌ ఏర్పడుతుంది. సున్నితత్వాన్ని కోల్పోతుంది. చర్మం కూడా ఫ్రెష్‌నెస్‌ను కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో చర్మాన్ని ప్రెష్‌గా, సున్నితంగా, కాంతివంతంగా చేయాల నుకుంటే కొన్ని చిట్కాలు పాటిస్తే సరి..
– టీస్పూన్‌ కొబ్బరినూనెలో ఒక టీస్పూన్‌ బేకింగ్‌ సోడా వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి చేతివేళ్లతో సున్నితంగా మర్దనా చేయాలి. పది నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రంగా కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోతుంది.
– చర్మం సున్నితంగా ఉండాలంటే కొద్దిగా టమోటో గుజ్జులో నిమ్మరసం వేసి బాగా మిక్స్‌ చేసి ముఖానికి పట్టించి అరగంట తర్వాత శుభ్రం చేసుకుంటే వేడితాపాన్ని తగ్గించి చర్మాన్ని దృఢంగా ఉంచుతుంది.
– టమాటాను తీసుకొని బాగా గుజ్జులా తయారుచేసి అందులో కొద్దిగా ఓట్‌ మీల్‌, ఒక చెంచా పెరుగు కలిపి, ఈ మిశ్రమాన్ని ముఖానికి మెడకు అప్లై చేయాలి. అరగంట తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల సన్‌ టాన్‌ తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది.
– ఒక క్యారెట్‌ని తురుముకుని కొంచెం నీరు పోసి ఉడకపెట్టాలి. చల్లారిన తర్వాత కొంచెం పాలు కలిపి మిశ్రమంలా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి అరగంట తరువాత చల్లని నీటితో కడిగివేయాలి. ఇలా చేయడం వల్ల మీ ముఖం కాంతివంతంగా, మృదువుగా తయారవుతుంది.
– వెల్లుల్లిని చిదిమి, దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని శుభ్రమైన గిన్నెలోకి తీసుకుని అందులో తాజా కలబంద గుజ్జును జోడించి కలపండి మొటిమలు మీద రాసి 10 నుండి 15 నిమిషాల తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచాలి. ఇలా చేయడం వల్ల మొటిమల సమస్య తగ్గుతుంది.