ఈసెట్‌ వెబ్‌ఆప్షన్ల నమోదుకు రేపే ఆఖరు

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలో ఇంజినీరింగ్‌, బీ ఫార్మసీ, బీఎస్సీ మ్యాథమెటిక్స్‌ కోర్సుల్లో 2023-24 విద్యా సం వత్సరానికి సంబంధించి ద్వితీ య సంవత్సరంలో (లాటరల్‌ ఎంట్రీ) ప్రవేశాలకు నిర్వహించిన ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రెన్స్‌ టెస్ట్‌ (ఈసెట్‌) కౌన్సెలింగ్‌ ప్రక్రి యలో ధ్రువపత్రాల పరిశీలన ముగిసింది. ఈ మేరకు సాంకే తిక విద్యాశాఖ కమిషనర్‌, ఈ సెట్‌ ప్రవేశాల కన్వీనర్‌ వాకాటి కరుణ బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు 12,876 మంది అభ్యర్థులు ధ్రువపత్రాల పరిశీలనకు హాజర య్యారని తెలిపారు.
శుక్రవారం వరకు వెబ్‌ఆప్షన్లు నమోదు చేసేందుకు అవకాశముంటుంద ని పేర్కొన్నారు. ఈ నెల 8 నాటి కి తొలివిడత సీట్లు కేటాయిస్తా మని వివరించారు. ఇప్పటి వర కు 5,113 మంది అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లను నమోదు చేశారని తెలిపారు. పూర్తి వివరాలకు https://tsecet.nic.in  వెబ్‌సైట్‌ను సంప్రదించాలని సూచించారు.